జనసేనాని త్వరగా కోలుకోవాలని హుస్నాబాద్ జనసేన అధ్వర్యంలో ప్రత్యేక పూజలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయుర్ ఆరోగ్యాలు ప్రసాదించాలని హుస్నాబాద్ నియోజకవర్గ జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు తగరపు శ్రీనివాస్ అధ్వర్యంలో స్థానిక ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాలిపెల్లి వినోద్, మల్లెల సంతోష్, రాసూరి వంశీ, లక్కిరెడ్డి హిమవంత్, మోరె బాబు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-30-at-1.06.45-PM-1-1024x472.jpeg)