జనసేన పార్టీ నియోజక వర్గ స్థాయి సమావేశం

ఒంగోలు: ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ ఆదేశాల మేరకు.. ఒంగోలు జనసేన పార్టీ ఆఫీస్ నందు గిద్దలూరు నియోజక వర్గం ఇంఛార్జి బెల్లంకొండ సాయిబాబు, జిల్లా నాయకులు లంకా నరసింహా రావు, కాల్వ బాల రంగయ్య, గజ్జలకొండ నారాయణ సమావేశంలో పాల్గొన్నారు, జూన్ నెల 19 వ తేదీన జరిగిన రైతు భరోసా యాత్ర, జూలై నెల 3,10 వ తేదీన జరిగిన జనవాణి, #GoodMorningCMSir కార్యక్రమాలు విజయవంతం చేయడం గురించి చర్చించడం జరిగింది. గిద్దలూరు నియోజక వర్గంలో పార్టీ పరిస్థితి, మండల నాయకుల పనితీరు, మండల కమిటీ గురించి చర్చించడం జరిగింది. త్వరలో మండల కమిటీ పూర్తి చేసుకొని, గిద్దలూరు పార్టీ విజయానికి కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు ఆదేశించారు.