ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ వేడుకలలో పాల్గొన్న జనసేన నాయకులు

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు.. మహనీయులను స్మరించుకునే విధంగా ఆజాదీక అమృతోత్సవ్ లో భాగంగా 9వ డివిజన్, మరియు 3 వ డివిజన్ జనసేన నాయకులు సత్యనారాయణ, ఫణి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పాల్గొని మహనీయులు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్.. ఈ కార్యక్రమం లో రాజారావు, మహేష్, తాటికాయల వీరబాబు, వాసిరెడ్డి శివ, తలాటం సత్య, ముసలయ్య, రవిరాజా, నల్లం శ్రీరాములు, ఆట్ల సత్యనారాయణ, ప్రసాద్, మరియు 3వ డివిజన్, 9 వ డివిజన్ స్థానిక జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.