నాగరాజు మోతుకూరు అధ్యక్షతన మండల కమిటి సమావేశం

పలమనేరు నియోజకవర్గం రూరల్ మండల అధ్యక్షుడు నాగరాజు మోతుకూరు అధ్యక్షతన రూరల్ మండల కమిటీ సభ్యులను కలిసి రానునున్న ఎన్నికలలో పార్టీ గెలుపుకోసం మరియు రూరల్ మండలంలో పార్టీ బలోపేతం కోసం పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలని దిశా నిర్దేశం చేశారు. మండల పరిధిలో ఉన్న 10 పంచాయితీలలో ఉన్న సీనియర్ నాయకులును కలుపుకుని మరియు మెగా అభిమానులను మనం ఓటర్లుగా మార్చుకోవాలని సూచించారు. అలాగే ఇంకో రెండు వారాల్లో పంచాయితీ కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలియ చేశారు మరియు వచ్చే ఆదివారం నుండి ప్రతి గ్రామానికి వెళ్లి అక్కడున్న జనసైనికులను కలుపుకుని ప్రజా సమస్యలపై పోరాడుతూ అలాగే జనసేన సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చెసే విధంగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాలేనటువంటి కమిటీ సభ్యులు ఇకపై చేపట్టపోయే కార్యక్రమాలకు తప్పుకుండా హాజరు కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మహేష్, లవకుమార్, వసంత్, అజిత్, జ్యోతిబోస్, రాజు, అజయ్, హరీష్, హేమాద్రి, సూర్య, లవన్, అయ్యప్ప, సుధాకర్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.