జనసేన కార్యకర్త చెన్నూరి కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా నాయకులు

గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొల్లిమర్ల గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త చెన్నూరి మోహన దుర్గ గత 16 వ తారీఖున గుండెపోటుతో మరణించారు.
ఆదివారం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాదరావు, ప్రధాన జాయింట్ సెక్రెటరీ తినాథ్, ప్రధాన కార్యదర్శి తాళ్లూరి అప్పారావు, మండల అధ్యక్షుడు నాగిశెట్టి సుబ్బారావు, కొలిమర్ల అధ్యక్షుడు వాసు, పార్టీ కార్యకర్త శివ, కోటేశ్వరరావు కొల్లిమర్ల గ్రామములోని చెన్నూరి మోహన దుర్గ నివాసానికి వెళ్లి మోహన దుర్గ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మోహన దుర్గ కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధార్యాన్ని నింపారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు గాదె మాట్లాడుతూ కాకుమాను మండలం లో జనసేన పార్టీ జెండా ఎగురవేసి పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన చెన్నూరి మోహన దుర్గ హఠాత్ మరణం పార్టీకి తీరని లోటని ఆయన అన్నారు. చెన్నూరి మోహన దుర్గ పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో గ్రామ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.