శ్రీవారికి అంగరంగ వైభవంగా చక్రస్నానం

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తుది అంకానికి చేరుకున్నాయి. శనివారం చివరి రోజున శ్రీవారికి చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం, చక్రత్తాళ్వార్లకు అభిషేకాలు నిర్వహించారు. దూప దీప నైవేధ్యాలు సమర్పించారు. చక్రస్నానంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. శనివారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారికి బంగారు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.