జనసేన పార్టీలోకి భారీ చేరికలతో తిరుగులేని నేతగా నిలిచిన బండారు శ్రీనివాస్

జనసేనాని ఆశయాలు నచ్చి, భారీగా చేరిన ఆత్రేయపురం మండలం రాజవరం గ్రామం గౌడ్ సామాజిక వర్గంవారు, కాపు సామాజికవర్గానికి చెందిన గ్రామస్తులు ప్రముఖ జనసేన నాయకులు బెజవాడ సతీష్ ఆధ్వర్యంలో బండారు శ్రీనివాస్ నియోజకవర్గ ఇన్చార్జ్ సమక్షంలో ఆదివారం జనసేన పార్టీలోకి భారీగా చేరి ఉన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని, ఆత్రేయపురం మండలంలోని, రాజవరం గ్రామం నందు ఆదివారం ప్రముఖ సీనియర్ నాయకులు బెజవాడ సతీష్ ఆధ్వర్యంలో రాజవరం గ్రామానికి చెందిన టిడిపి పార్టీ నాయకులు, గౌడ సామాజిక వర్గానికి చెందిన కోట వెంకన్న బాబు, మరియు కాపు సామాజిక వర్గానికి చెందిన తూటీ గోవిందు వారి అనుచరులతో భారీగా ఆదివారం రాత్రి 9 గంటలకు జనసేన పార్టీలోకి, కొత్తపేట నియోజకవర్గం ఇన్చార్జి జనసేన ప్రముఖ నాయకులు బండారు శ్రీనివాస్ సమక్షంలో చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమం ఆత్రేయపురం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షులు చేకూరి కృష్ణంరాజు నాయకత్వంలో, ప్రముఖ సీనియర్ నాయకులు బెజవాడ సతీష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి భారీగా చేరినారు. ఆత్రేయపురం మండలం నుంచి విశేషంగా గత కొద్ది రోజుల నుంచి భారీగా చేరికలు జరుగుతుండడం చూసి, జనసేన పార్టీ నాయకులు బండారు శ్రీనివాస్ ఎంతో సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. జనసేనాని లాంటి గొప్ప నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమని, రేపటి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగే గొప్పనాయకుడుగా, నిజాయితీపరుడైన జనసేనాని మాత్రమేనని, ఈ రాష్ట్రానికి దశ దిశా చూపించగలరని, ప్రజలు నమ్ముతూ, జనసేనాని ఆశయాల పట్ల ఆకర్షితులై, ప్రజల్లో మార్పు మొదలైందని, ఈ మధ్యకాలంలో ఈ భారీ చేరికలే దీనికి నిదర్శనమని, బండారు శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన, కార్యదర్శిలు తాళ్ల డేవిడ్ రాజ్, బొక్క ఆదినారాయణ, దొంగ సుబ్బారావు మరియు ఆత్రేయపురం మండల పలువురు ప్రముఖ నాయకులు, రావులపాలెం మండల జనసేన పార్టీ అధ్యక్షులు తోట స్వామి మరియు కొత్త పేట నియోజకవర్గం జనసేన పార్టీ ప్రముఖ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.