‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ షూటింగ్ పూర్తి
టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ తాజాగా నటిస్తున్న సినిమా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఈ మూవీ షూటింగ్ శనివారంతో కంప్లీట్ అయ్యింది. ఈ సందర్భంగా మూవీ యూనిట్కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు సుశాంత్. ఈ సినిమాతో దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఏ1 స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. డిసెంబరులో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే అది థియేటర్లలోనా లేదంటే ఓటీటీ అనేది తెలియాల్సి ఉంది.