పింగళి వెంకయ్యకు ఘన నివాళులు

కేశవదాసుపాలెం: జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్ర సమర యోధులు శ్రీ పింగళి వెంకయ్య 146 జయంతి సందర్భంగా కేశవదాసుపాలెం గ్రామ పంచాయతి అవరణలో గ్రామ సర్పంచ్ మేడిది సరోజ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉండపల్లి అంజి, వి.ఆర్.ఓ నాగరాజు, వెల్ఫేర్ ప్రమోద్, చెల్లుబోయిన నాగరాజు, చిట్టురి వి.వి సత్యనారాయణ, మెడిది మురళీ, గెడ్డం సుజాత, నాని, పంచాయతి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.