తిరుపతి ఎమ్మెల్యే టికెట్ బలిజలకు ఇవ్వగలరా..?: ఆకేపాటి సుభాషిణి

తిరుపతి: స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి మాట్లాడుతూ.. బ్వైసీపీ నిజంగా బలిజల పక్షపాతే ఐతే.. ఈ 2024 ఎలక్షన్ లో తిరుపతి ఎమ్మెల్యే టికెట్ బలిజలకు ఇవ్వగలరా.. ??? బలిజలను బానిసలుగా చూస్తున్న వైసీపీ ప్రజలే తగిన బుద్ది చెబుతారు.. బడుగు బలహీనుల పరిస్థితి చెప్పనక్కర్లేదు.. కేవలం ఓటు బ్యాంకు రూపంగానే చుస్తున్నారు తప్ప.. వాళ్లకు భరోసా ఎక్కడ ?? 2024 ప్రజలే బుద్ది చెబుతారని.. జనసేన రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి వైసీపీ ప్రభుత్వంపై మండి పడ్డారు.