ఆప్టేక్ చానల్ కాలువలను తక్షణమే బాగుచేయాలి: జనసేన డిమాండ్

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం. నాగావళి ఎడమ కాలువ అనుబంధ ఆప్టేక్ చానల్ కాలువ గట్టులు కోతకు గురి అవుతున్నా సంబంధించిన నీటి పారుదల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు అని జనసేన పార్టీ నాయకులు అన్నారు. మంగళవారం నాగావళి ఎడమ కాలువ అనుబంధ కాలువలను మత్స.పుండరీకం, బి.పి.నాయుడు, జనసేన జాని, కర్నేన సాయి పవన్ లు కంబర, కంబర వలస, నడుకురు గ్రామంలో వర్షంలో సైతం పర్యటించి కాలువలను పరిశీలించారు.

కొంతమంది రైతుల కలిసి కాలువల పరిస్థితి గురించి అడగగా గత పది ఏళ్లుగా ఈ కాలువల్లోని మొక్కలు, పూడికతో నిండి ఉన్నాయని, ఉపాధి హామీ పథకంలో బాగుచేయమని పలుమార్లు అధికారులు దృష్టి కి తీసుకువెళ్లినా ఫలితం లేదని రైతులు జనసేన పార్టీ నాయకులతో చెప్పారు. మత్స.పుండరీకం ఈ సందర్భంగా మాట్లాడుతూ నాగావళి ఎడమ కాలువాల అనుబంధ కాలువాలకు నీటి సంఘాలు ఉన్నాయి వాటి నిధులు ఏమైనట్టు అని ప్రశ్నించారు. నీటిపారుదల శాఖ అధికారులు నిధురపోతున్నరా..? ప్రతి కాలువకి లష్కర్ లు వుండేవారు, కాలువాలను పరిశీలించి వాటిని బాగుచేసేవారు. ఈ రోజు నీటి పారుదల శాఖలో లాస్కర్ లు లేని పరిస్థితి ఏర్పడింది. సంబంధించిన అధికారులు తక్షణమే ఆప్టేక్ చానల్ కాలువలను బాగుచేయాలని జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కలిపిల్లి సింహ చలం, వాన మహేష్, ప్రణీత్, మత్స. కృష్ణరావు, వాన మహేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

సాగునీటి పంటకాలువాలను పరిశీలిస్తున్న జనసేన పార్టీ నాయకులు.