దసరాకి రిలీజ్ అయ్యే అవకాశం ఉన్న ‘రంగ్ దే’
హీరో హీరొయిన్లు గా నితిన్, కీర్తిసురేశ్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ముందుగా జూలైలో విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ కరోనా ప్రభావం కారణంగా థియేటర్స్ ఓపెన్ కాకపోవడంతో రిలీజ్ ఆలోచన వాయిదా పడింది. తాజా సమాచారం మేరకు ఈ చిత్రాన్ని దసరా పండుగకు విడుదల చేద్దామని మేకర్స్ అనుకుంటున్నారట. అప్పటికే సినిమా థియేటర్స్ విషయంలో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.