రోజా నీది నోరా తాటి మట్ట?: ఎస్ వి బాబు

గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోలో అడ్డంగా బుక్ అయిపోయిన విషయం తెలిసిందే.

నేను ఒక మహిళను, పైగా మంత్రిని అనే సిగ్గు లేకుండా గోరంట్ల మాధవ్ ని సమర్థిస్తున్న రోజా.

ఎ ఆడబిడ్డకైనా అన్యాయం జరిగితే గన్ కంటే ముందు జగన్ వస్తాడని సోది మాటలు చెప్పిన రోజా ఇప్పుడు విషయాన్ని వక్రీకరిస్తూ విచారణలో ఉంది టైం పడుతుందని చెత్త కబుర్లు చెబుతుంది.

గతంలో అంబటి, అవంతి కూడా ఆడవాళ్ళతో అసభ్యంగా మాట్లాడుతూ అడ్డంగా బుక్ అయిపోయారు. వారి మీద ఏ చర్యలు తీసుకోకుండా సిగ్గు లేకుండా అంబటికీ మంత్రి పదవి ఇచ్చారు. దీన్ని బట్టి అర్థమవుతుంది తప్పు చేసిన వాడు మీ వాడైతే మీరు ఎట్లా సమర్థిస్తారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు.

గోరంట్ల మాధవ్ గత చరిత్ర కూడా నేరమయం. అలాంటి దుర్మార్గుడికి సీటు ఇచ్చి ఎంపీగా చేసిన వైసీపీ పార్టీ ఎంత నీతిమాలిన పార్టీనొ అర్థం చేసుకోవచ్చు.

జన సైనికులను పిల్లలు అంటూ ఎక్కిలి మాటలు మాట్లాడుతున్న రోజా. రోజా పెద్ద ఆరింద, ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టింది. తన కంటికి అందరూ పిల్లలు లాగానే కనబడుతుంటారు.

విశాఖ ఋషికొండ ధ్వంసం చేయడాన్ని చూసి చూడనట్లుగా వదిలేసినందుకు మంత్రి రోజాకు బెంజ్ కార్ బహుమతిగా వచ్చిందనేది ప్రధాన ఆరోపణ.

బెంజ్ కార్ విషయాన్ని బయట పెట్టినందుకు రోజా జనసైనికులపై విషం కక్కుతుంది.

నేను 150 సినిమాలో నటించా, ఇప్పటికీ జబర్దస్త్ షోలో లచ్చ లచ్చలు డబ్బులు వస్తున్నాయి. నా కష్టార్జితంతోనే బెంజ్ కారు కొనుక్కున్న అంటూ మీడియా ముందు కవరింగ్ ఇస్తుంది.

అవును రోజా పవన్ కళ్యాణ్ గారు ఒక్క సినిమాలో నటిస్తే 100 కోట్లు తీసుకుంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు రెండు కోట్లు పెట్టి ఎనిమిది కార్లు కొనలేరా?

మంచి చెడు వెనక ముందు ఆలోచించాలి కదా. అదేదీ లేకుండా తాడేపల్లి ప్యాలెస్ నుండి వచ్చిన స్క్రిప్ట్ పట్టుకుని మీడియా ముందు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఎవరు గిఫ్ట్ ఇచ్చారో చెప్పాలంటూ చెత్త వాగుడు వాగావ్. ఏమైంది

తీరా నీ వరకు వచ్చేటప్పటికి తత్వం బోధపడి, లబోదిబోమంటూ మొత్తుకుంటున్నావ్.

ఇక ముందే అయినా రోజాకి మేం చెప్పేది ఒకటే మొదట నీ నోటిని అదుపులో పెట్టుకో, లేకుంటే ఇలాంటి తిప్పలే పడవలసి వస్తుందని పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఎస్ వి బాబు రోజా వ్యాక్యలపై మందిపడ్డారు.