కంభం మండలంలో జనసేన పర్యటనలో బెల్లంకొండ
ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం కంభం మండలంలోని లింగాపురం గ్రామంను జనసేన ఇంచార్జ్ బెల్లంకొండ సాయిబాబు పర్యటించారు. ఆ గ్రామంలో ఇంటి ఇంటికి వెళ్ళి గ్రామంలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అలాగే జనసేన పార్టీ కి మీ అందరి సహకారం కావాలి అని కోరారు. జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి రైతు భరోసా యాత్రలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు లక్ష రూపాయలు ఇవ్వడం, జనవాణి ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుని.. వాటిని పరిష్కరించడం, ఇలాంటి అనేక కార్యక్రమాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని.. గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది, రాబోయే ఎలక్షన్లో జనసేన పార్టీ తప్పకుండా గెలిపించాలని అందరిని కోరుచున్నానని బెల్లంకొండ సాయిబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకులు, జనసేన కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-10-at-8.58.36-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-10-at-8.58.37-PM-1024x576.jpeg)