సిఎస్ఐ చర్చికి విరాళం అందించిన పోతిన మహేష్

వించిపేట సిఎస్ఐ చర్చికి 50000 రూపాయల విరాళం ప్రకటించి 25000 రూపాయలు నగదు ను ఆదివారం జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ విజయవాడ నగర అధ్యక్షులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అందజేయడం జరిగింది.
వించిపేట సి ఎస్ ఐ చర్చి మొదటి అంతస్తు నిర్మాణం జరుగుచుండగా చర్చి నిర్మాణం నిమిత్తం జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జీ, నగర అధ్యక్షులు పోతిన మహేష్ ను విరాళం అడగగా ఆదివారం సిఎస్ఐ చర్చికి రాగా.. చర్చి పాస్టర్ తగరం శ్యామ్ బాబు మరియు కమిటి సభ్యులు పొతిన మహేష్ కు స్వాగతం పలికి సత్కారం చేయడం జరిగింది. అనంతరం చర్చి నిర్మాణం కోసం పొతిన మహేష్ 50.000 రూపాయలను ప్రకటించి ముందుగా 25000 రూపాయలను సంఘం సమక్షంలో చర్చి పాస్టర్ తగరం శ్యామ్ బాబు కి అందచేసినారు.. మిగిలిన 25000 రూపాయలను వచ్చే ఆదివారం ఇస్తానని చెప్పినారు ఈ సదర్భంగా సంఘ యువజన నాయకులు మహేష్కు అభినందనలు తలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *