మదనపల్లిలో ఘనంగా హర్ ఘర్ తిరంగా..
మదనపల్లిలో ఘనంగా హర్ ఘర్ తిరంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయింది.. ఈ సందర్బంగా మన ఊరిలో ప్రతి ఒక్క ఇంటి ముందు మువ్వన్నెల జెండా కడితే చాలా సంతోషంగా ఉంది. ఇలా ఆగస్టు 7వ తేదీ నుంచి మువ్వన్నెల జెండాలు దేశమంతా కనిపిస్తున్నాయి.. రెపరెపలాడుతోన్న మువన్నెల జెండా తెలుగు రాష్ట్రాల్లోని కులకుటుంబ రాజకీయ బానిసలు కళ్ళు తెరిచి.. ఈ జెండా వెనుక ఉన్న వీరులని గుర్తు తెచ్చుకుని బానిస సంకెళ్ళు నుండి విముక్తి పొందండి అని దారం అనిత అన్నారు.