దుబ్బాక ఉప ఎన్నికపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

దుబ్బాక ఉప ఎన్నికలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. దుబ్బాకలో మా స్థానంను నిలబెట్టుకుంటామని.. గతం కంటే మెరుగు అయిన మెజార్టీ వస్తుందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ముమ్మాటికీ దుబ్బాకలో మంచి మెజార్టీ తో గెలవబోతున్నామని.. బిజెపి పార్టీ సమాజం లో తక్కువ.. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ అని ఎద్దేవా చేశారు. గోబెల్స్ కే పాఠాలు చెప్పే స్థితిలో బిజెపి ఉందని.. కాంగ్రెస్, బిజెపికి దుబ్బాకలో డిపాజిట్ లు కోల్పోయిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు. బిజెపి ది డొల్ల ప్రచారమని..దుబ్బాక గడ్డకు ప్రజా చైతన్యం ఉందని పేర్కొన్నారు. బిజెపి నేతలు పోలీసులు పై మాట్లాడిన భాషను ఖండిస్తూన్నామని.. మేము మాట్లాడితే పీఎం, కేంద్ర మంత్రులను వదలమని.. మేము కూడా బూతులు మాట్లాడగలుగుతమని వార్నింగ్ ఇచ్చారు. 27 వేల 718 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణమాఫీ తెలంగాణ చేసినట్టు ఆర్బీఐ నివేదిక ఇచ్చిందని.. ఆ ఘనత కేసీఆర్ కి, మా ప్రభుత్వం కు దక్కుతుందని కొనియాడారు. రైతు బంధు రూపంలో 28 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని.. రాష్ట్ర జిస్డిపిలో వ్యవసాయ రంగం కంట్రిబ్యూషన్ రెట్టింపు అయ్యిందని తెలిపారు. తెలంగాణ లో తలసరి ఆదాయం అరేండ్లలలో రెట్టింపు అయ్యిందని.. దివాలకోరు ప్రతిపక్షాలు ఆర్బీఐ నివేదికను గుర్తుస్తాయో లేదో చూడాలన్నారు. ఏ ఎన్నిక వచ్చిన ప్రజలు కేసీఆర్ కు జై కొడుతున్నారని గుర్తుచేశారు.