పెళ్లకురు జనసేన ఆధ్వర్యంలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు
పెళ్లకురులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.. ఈ సందర్బంగా జనసేన పార్టీ పెళ్లకూరు మండల ప్రెసిడెంట్ విజయ్ మల్లామ్ మాట్లాడుతూ దేశ ప్రజలకు 75వసంతాల స్వాతంత్ర్య భారతావనికి శుభాకాంక్షలు తెలుపుతూ.. మంచి నాయకులను ఎన్నుకోవడం తోనే దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినవారికి ఘన నివాళి అని చెప్పారు. ఈ వేడుకలో ఉపాధ్యక్షుడు కుంపటి శ్రీను, ప్రధాన కార్యదర్శి పిన్నబత్తిన సందీప్, బద్దీ వెంకటేష్, విద్యార్థులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-15-at-1.17.12-PM-1024x462.jpeg)