శ్రీశైలం డ్యాంకు ప్రమాద హెచ్చరిక

కర్నూలు: శ్రీశైలం డ్యాంకు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరించారు. డ్యాం ప్లంజ్ పూల్ కింద భారీగా గుంతలు ఏర్పడ్డాయి. 6, 8 గేట్ల వద్ద గుంతలు పెద్దవిగా అవుతున్నట్లు నిపుణులు గుర్తించారు. 2002లో వేసిన కాంక్రీట్..వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో డ్యాం లోపలికి గొయ్యి విస్తరించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. డ్యాం మరమ్మతులకు సుమారు రూ.900 కోట్లు ఖర్చు అవుతుందని నిపుణుల కమిటీ అంచనా వేసింది.