ఇచ్చాపురం జనసేన ఆధ్వర్యంలో జాతీయజెండా ఆవిష్కరణ

ఇచ్చాపురం నియోజకవర్గ జనసేనపార్టీ కార్యాలయంలో జాతీయజెండా ఆవిష్కరణ కార్యక్రమం జనసేన ఇంచార్జి దాసరి రాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. అలాగే ఇన్నేసుపేటలో దుంగు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ విగ్రహ ప్రతిష్ఠ జరిగిన ప్రదేశంలో జాతీయజెండా ఆవిష్కరణ ఘనంగా జరిగింది. మరియు ఇచ్చాపురం మున్సిపాలిటీలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి స్వాతంత్ర్య దినోత్సవ సంధర్భంగా నివాళులు అర్పించారు. సభలో ఈ సందర్భంగా దాసరి రాజు మాట్లాడుతూ ఎంతోమంది స్వతంత్ర సమరయోధుల ప్రాణత్యాగం ఫలితంగా మనం ఈరోజు 75వ స్వాతంత్ర్య దినోత్సవం పూర్తి చేసుకుని 76 వ వసంతంలోకి అడుగుపెడుతున్నాం. వారి ప్రాణత్యాగ ఫలితంగా వచ్చిన ఈ స్వాతంత్య్రంని ప్రతీ ఒక్కరూ స్వంత ప్రలోభాలను పక్కనపెట్టి దేశ అభివృద్ధికి పాటుపడాలని జనసేనపార్టీ తరపున పిలునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిదిగా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధ రెడ్డి పాల్గొన్నారు. పెద్ద ఎత్తున జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.