సెట్లో అడుగపెట్టిన మహేష్
‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్తో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేయగా, వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక కరోనా వైరస్ కారణంగా సుమారు ఆరు నెలల నుండి షూటింగ్స్ అన్నీ బంద్ కావడంతో మహేష్ ఇంటికే పరిమితమయ్యారు. మధ్యలో ఓ యాడ్ షూటింగ్ కోసం బయటకు వచ్చారు.
ప్రస్తుతం అందరు హీరోలు సినిమా షూటింగ్స్తో బిజీ బిజీగా ఉంటున్న నేపథ్యంలో సూపర్ స్టార్ కూడా తన తాజా చిత్రం సర్కారు వారి పాట షూటింగ్ మొదలు పెట్టారు. మహేష్ సెట్లో ఉన్నప్పుడు తీసిన ఫోటోని నమ్రత తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. లైట్స్, కెమెరా, యాక్షన్ ఈ మూడు పదాలు సినిమా స్టార్స్కి మ్యాజిక్ క్రియేట్ చేస్తాయని పేర్కొంది. తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.