భైరిపురంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ
చీపురుపల్లి, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లను చీపురుపల్లి నియోజకవర్గం మెరకముడిదాం మండలం భైరిపురం గ్రామంలో క్రియాశీలక జనసైనికులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ జనసైనికులతో
- వాళ్ళ గ్రామంలో సమస్యలు,
- పార్టీని బలోపేతం ఎలా చేయాలి?
- పార్టీ యొక్క సిద్ధాంతాలు, ఆశయాలు, ప్రజలకి చెప్పడం వంటి అంశాలపై చర్చించడంతో పాటు చనిపోయిన కౌలు రైతులకు 30 కోట్లు సహాయం చేసిన టీమ్ పిడికిలి పోస్టర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-17-at-6.05.59-PM-1024x768.jpeg)