పలు జనసైనికుల కుటుంబాలను పరామర్శించిన కాంతిశ్రీ
ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన కొత్తకోట పంచాయతీ జనసేన పార్టీ కుటుంబ సభ్యులు రీసు లక్షి, మురళి.. అదేవిదంగా అప్పారావు, ఆదినారాయణ, గురువమ్మ కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసి ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ వారి కుటుంబాలకు పరామర్శించి, ధైర్యం చెప్పి, వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని, వారికి జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో లావేరు మండల జనసైనికులు బార్నాల దుర్గారావు, కాకర్ల బాబాజీ, పవన్ కళ్యాణ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.