గంగుడుపల్లి సచివాలయాన్ని సందర్శించిన జనసేన నాయకులు

తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం గంగుడుపల్లిలోని సచివాలయాన్ని జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గం బాధ్యులు దేవర మనోహర్ పరామర్శించారు. అనంతరం సచివాలయం మహిళా ఉద్యోగులతో మాట్లాడుతూ వైసిపి నాయకుల ఆగడాలకు ఎదుర్కొనే శక్తి ఒక్క జనసేనకే ఉందని, ఈ ఘటన బాధాకరమని మా నాయకుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం బాధాకరమని, ఇలాంటి ఘటనలను జనసేన సహించబోదని, సచివాలయంలో కనీసం మరుగుదొడ్లు కూడా లేవని మహిళా ఉద్యోగులను మానసికంగా వేధించిన చిరంజీవిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని, ఇలానే కొనసాగితే రాబోయే ఎన్నికలలో ప్రజలే వీరికి బుద్ధి చెబుతారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గ బాధ్యులు దేవర మనోహర్, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, నియోజకవర్గ మహిళా విభాగ నాయకురాలు ఆశ తదితరులు పాల్గొన్నారు.