క్రియాశీలక జనసైనికునికి అండగా జనసేన

ఆమదాలవలస నియోజకవర్గం ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామానికి చెందిన జనసైనికుడు ధవళ సీతారాం ఇటీవల ప్రమాదానికి గురి కావడం జరిగింది. విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఇంచార్జీ పేడాడ రామ్మోహన్ రావు వారిని పరామర్శించి, జనసేన పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే సీతారాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ఆ పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కలిగి ఉండటంతో రామ్మోహన్ ఆయా భీమా సంస్థల నుండి జనసేన పార్టీ తరపున 37,520 రూపాయలు విడుదల అయ్యేలా బాధ్యత వహించారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో ఆ కుటుంబానికి నేడు వారి గ్రామంలో స్థానికుల సమక్షంలో అందచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ లో ప్రతి కార్యకర్తకు అన్ని వేళల్లో పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస రోటరీ క్లబ్ అధ్యక్షులు పాత్రుని పాపారావు, పేడాడ హేమలత, ఎస్.వి.ఎస్ పాఠశాల ప్రిన్సిపాల్ ప్రతాప్, అప్పలనాయుడు, సరుబుజ్జిలి జడ్పీటీసీ అభ్యర్థి పైడి మురళీమోహన్, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.