చిరు పవన్ చరణ్ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
రాజోలు, మెగాస్టార్ చిరంజీవి 67వ పుట్టిన రోజు సందర్భంగా మల్కిపురం, సఖినేటిపల్లి మండలాల చిరు పవన్ చరణ్ సేవా సమితి ఆధ్వర్యంలో లక్కవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గౌరవ అధ్యక్షులు రావి మురళి అధ్యక్షతన అధ్యక్షులు ముదిగొండ బుజ్జి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి మెగా అభిమానులు రక్తదానం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-20-at-9.05.57-PM-1024x830.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-20-at-9.05.58-PM-1024x599.jpeg)