జనసేన పార్టీకీ సంఘీభావం తెలిపిన రాజమండ్రి ప్రజలు

రాజమహేంద్రవరం అర్బన్ జనసేన పార్టీ ఇంచార్జ్ వర్యులు అనుశ్రీ సత్యనారాయణ పిలుపుమేరకు నగర కార్యదర్శులు విన్నావాసు మరియు గుణ్ణం శ్యాంసుందర్ వారి ఆధ్వర్యంలో 16 వ వార్డు నుండి స్ధానిక ఎస్.ఎస్, ఎల్బి మొదలగు పలు అపార్ట్మెంట్స్ వారు జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ని కలిసి జనసేన పార్టీకీ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దుర్గేష్ వీరు పార్టీ లోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దుర్గేష్ ని కలిసిన వారు త్వరలో స్థానిక ప్రజలు జనసేన పార్టీలో భారీ చేరికలు ఉంటాయని తెలిపారు.