తిరుపతి జనవాణి కార్యక్రమంలో కళ్యాణదుర్గం జనసేన

తిరుపతి జనవాణి కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులకు నీళ్లు అందిస్తామని గత ప్రభుత్వం మాటలు చెబుతూనే ఉండిపోయారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పూర్తిగా మర్చిపోయి పాలన కొనసాగిస్తున్నారు. అలాగే సర్వే నెంబర్ 329 సుబేదార్ చెరువు ఆక్రమనకు గురయ్యి రియల్ ఎస్టేట్ వేయాలని వందలాది టిప్పర్ల మట్టితో చెరువును పూడ్చి వేశారు. అలాగే అనంతపురంలో టమోటా పండించిన రైతు గిట్టుబాటు ధర లేక రోడ్డు పక్కన పారబోస్తున్న విషయాలను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, కళ్యాణదుర్గం జనసేన పట్టణ అధ్యక్షులు రమేష్, చిరంజీవి యువత కళ్యాణదుర్గం నియోజకవర్గం అధ్యక్షులు ఎల్. రాఘవేంద్ర గుప్తా, జనసేన నాయకులు ముక్కన్న, అరవింద్ పాల్గొనడం జరిగింది.