తెలంగాణా భవన్ వద్ద హైఅలెర్ట్

తెలంగాణా భవన్ ని బిజెపి ముట్టడించే అవకాశం ఉన్న కారణంగా తెరాస పార్టీ అప్రమత్తమైంది. ఇక ప్రగతి భవన్ ని, తెలంగాణా భవన్ ని బిజెపి ముట్టడించే అవకాశం ఉందని నిన్న మీడియా సమావేశంలో మంత్రి కేటిఅర్ చెప్పారు. ఈ నేపధ్యంలో ప్రగతి భవన్, తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు మొహరించారు.

బీజేపీ ముట్టడిస్తుందనే అనుమానం తో ప్రగతి భవన్, టిఆర్ఎస్ భవన్ వద్ద పోలీస్ ల బందోబస్తూ ఏర్పాటు చేసారు. బీజేపీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించి దుబ్బాకలో సింపతి ఓట్లు పొందే కుట్ర చేస్తోందని కేటిఅర్ ఆరోపణలు చేసారు. పటిష్ట చర్యలు తీసుకోవాలని డిజిపిని టిఆర్ఎస్ కలిసి కోరారు. ముందు జాగ్రత్తగా ప్రగతి భవన్, తెలంగాణ భవన్ వద్ద పటిష్ట భద్రత కల్పించారు.