జనసేన జన జాగృతి యాత్ర
- గ్రామ గ్రామానా తేనీటీ విందు కార్యక్రమం 3వ రోజు
రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం మల్లంపూడి గ్రామంలో 3వ రోజు జన జాగృతి యాత్ర కార్యక్రమం ప్రజల ఆదరణతో ముందుకు సాగుతుంది. రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప కీలక పాత్ర వహిస్తున్న ఈ తేనిటీ విందు కార్యక్రమంలో రాజానగరం మండలం అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర ఆధ్వర్యంలో కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, నల్లమిల్లి విష్ణుచక్రం, నాగావరుపు భానుశంకర్, ముక్కినడా శ్రీరామ్, అడబాల సత్యనారాయణ, అడబాల హరి, సుంకర బాబ్జి, కానవరం రామకృష్ణ, తెలగంశెట్టి శివ, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను గ్రామంలోని ప్రజలకు వివరిస్తూ జనసేన పార్టీ గుర్తు అయిన గ్లాజు గ్లాసుతో తేనీరు ఇవ్వడం జరిగింది. దానికి ప్రజలందరూ సహకరించి, ఈసారి జనసేన పార్టీని ఆశీర్వదించాలని, పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇచ్చి జనసేన ప్రభుత్వాన్ని స్థాపించాలని, గ్రామంలో ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ జనసేన షణ్ముఖ వ్యూహం ముద్రించిన కరపత్రాలను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున జనసేన నాయకులు, వీర మహిళలు, మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-24-at-6.49.31-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-24-at-6.49.30-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-24-at-6.49.32-PM-1024x576.jpeg)