మైనారిటీలకు ఏ హామీ నెరవేర్చారని ప్రశ్నించిన షేక్ సుభాని

ఉదయగిరి, వైసీపీలో ఉండే ముస్లిం మైనారిటీ ఎమ్మెల్యేలను సూటిగా ప్రశ్నించిన వింజమూరు మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు షేక్ సుభాని పత్రికా విలేకరులతో మాట్లాడుతూ… అంజాద్ బాషా, హఫీజ్ ఖాన్, ఇక్బల్ అహమద్, మహమ్మద్ ముస్తఫా మాట్లాడితే 95శాతం హామీలు జగన్ రెడ్డి నెరవేర్చాడు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మైనారిటీ ఎమ్మెల్యేలుగా పదవులు అనుభవిస్తున్న మీరే చెప్పండి. దూల్హన్ పధకం, విదేశీ విద్య, ఏ.పిఎస్ఎంఎఫ్సి సబ్సిడీ రుణాలు, హాజ్ యాత్రకు ఆర్థిక సాయం, వకక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, ఈమమ్ మౌజన్లకు గౌరవ వేతనం, ఇమమ్ మౌజన్ లకు ఇళ్ల స్థలాలు ఇస్లామిక్ బ్యాంక్, మసీద్ ల మరమ్మత్తుల కోసం ఆర్థిక సాయం, మైనారిటీ మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాలు, వీటిలో ఏ హామీ నెరవేర్చారో ఎప్పుడు నెరవేర్చారో తెలియాచేయాలి లేదా తక్షణమే మీ పదవులకు రాజీనామా చేయాలని ఆంధ్రప్రదేశ్ ముస్లిం మైనారిటీల అందరి తరుపున జనసేన పార్టీ తెలియచేస్తున్నానని సుభాని అన్నారు.