పొదిలి గోపి హత్య కేసులో ముద్దాయిలను వెంటనే శిక్షించాలని జనసేన డిమాండ్

ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు నియోజకవర్గం, చీమకుర్తి మండలం కె.వి.పాలెంలో హత్యకు గురైన జనసేన కార్యకర్త పొదిలి గోపి హత్య కేసులో ముద్దాయిలను వెంటనే శిక్షించాలని కోరుతూ చేసిన పాదయాత్ర శనివారం ఒంగోలు కలెక్టరేట్ కి చేరుకొని కలెక్టర్ ని కలిసి ముద్దాయిలను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు మలగా రమేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, వీరమహిళ సుంకర కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.