పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల నీట మునిగిన శర్మ కాలనీ: సింగనమల జనసేన

సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం పంచాయతీలోని శర్మ కాలనీ వర్షం వల్ల నీటి మునిగింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వర్షం నీళ్లు ఇళ్లల్లోకి వస్తున్నాయి. గత సంవత్సరం వర్షాలకి ఇలాగే కాలనీ నీట మునిగింది. అప్పటి అధికారులు, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పరామర్శించి నీట మునిగిన ఇళ్ళకి పక్కా గృహాలు కలవకట్టి కాలవకి రక్షణ గోడ కడతామని హామీ ఇచ్చారు. పదిమందికి ఆహార పొట్లాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గత సంవత్సరం ఇచ్చిన హామీ నెరవేర్చి ఉంటే ఈ వర్షానికి కాలనీ నీటి మునిగేది కాదని సింగనమల జనసేన తెలియజేయడం జరిగింది.