కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు

  • సర్వేపల్లిలో ప్రారంభమయిన జనసేనాని జన్మదిన వేడుకలు
  • కొత్తకోడూరు బీచ్ లో స్వచ్ఛభారత్
  • దుకాణ దారులకు డస్ట్ బిన్లు పంపిణీ

సర్వేపల్లి నియోజకవర్గం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాలలో భాగంగా ఆదివారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో తోటపల్లిగూడూరు మండలంలోని కొత్తకోడూరు బీచ్ లో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తకోడూరు బీచ్ వద్ద అనేక వ్యాపారాలు చేస్తున్నటువంటి దుకాణ దారులకు జనసేన నాయకులు డస్ట్ బిన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ ప్లాస్టిక్ ఫ్లెక్సీల కారణంగా పొల్యూషన్ ఏర్పడుతుందని, ప్లాస్టిక్ ఫ్లెక్సీల వాడకాన్ని నిషేధిస్తూ వైసిపి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మంచిదే, కానీ ప్లాస్టిక్ కవర్లు తయారు చేసే కంపెనీలపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు. ప్లాస్టిక్ కవర్లు తయారు చేసే కంపెనీలను మూసివేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే కదా, అలాంటప్పుడు ప్లాస్టిక్ కవర్లు తయారు చేసే కంపెనీలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోగలుగుతుందా, పొల్యూషన్ కారణమైన కంపెనీలపై కూడా చర్యలు తీసుకోవాలి కదా, పొల్యూషన్ రిలీజ్ చేసే కంపెనీలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో పిచ్చి పిచ్చి మద్యాన్ని ప్రజలకు అందించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కంపెనీలపై కూడా చర్యలు తీసుకోవాలి, ఆ పిచ్చి మద్యం తాగి ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు. మరి పిచ్చి మందుపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించాలని కోరుతున్నాం. ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్న, ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చిన సర్వేపల్లి నియోజకవర్గంలోని కొత్త కోడూరు బీచ్ ని మాత్రం అభివృద్ధి చేయలేకపోతున్నారు. బీచ్ వద్ద కనీస వసతులు కూడా లేవు. కొత్త కోడూరు బీచ్ కు వెళ్లే మార్గం కూడా సక్రమంగా లేదు. కనీస అభివృద్ధికి నోచుకొని కొత్త కోడూరు బీచ్ ను అభివృద్ధి చేయకపోవడం బాధాకరం. వెంటనే నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేయాలని జనసేన పార్టీ తరఫున ఉన్నతాధికారులకు కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు అంకెం సందీప్, జనసేన పార్టీ నాయకులు షేక్ రహీం, రేవంత్, శేఖర్, సుకుమార్ రెడ్డి, శ్రీహరి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.