“నాసేన కోసం – నా వంతు” పోస్టరు విడుదల చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన

ఖమ్మం జిల్లా కేంద్రం, గట్టయ్య సెంటర్ నందు ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ యువజన విభాగం ఆద్వర్యంలో “నాసేన కోసం – నా వంతు” (పార్టీకి మన వంతు సహాయంగా విరాళాలు అందించే కార్యక్రమం) కార్యక్రమం మరియు జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా తలసేమియా పిల్లలకు అవసరమైన రక్త సేకరణ శిబిరం నిర్వాహణ గురించి జరిగిన సన్నాహక సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. ఈ సమావేశంలో యువజన విభాగం అధ్యక్షుడు డేగల రామచంద్రరావు, ప్రధాన కార్యదర్శి మేడబోయిన కార్తీక్, ఉపాధ్యక్షులు యసంనేని అజయ్ కృష్ణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గుంత సత్యనారాయణ, ఎల్. పుల్లారావు వీరమహిళా విభాగం అధ్యక్షురాలు బోగ హరిప్రియ, అనూష మరియు జనసేన కార్యకర్తలు అంగోత్ శ్రీనివాస్, షేక్ మాలిక్, దేవేందర్, గోపికృష్ణ, ఉత్తమ్ రాజ్, రమణ కుమార్, సర్వంత్, అనిల్, శ్రీనివాస్ తదితరులు హజరయ్యారు. ఈ సమావేశంలో ఇటీవల మరణించిన ములకలపల్లి మండలానికి చెందిన జనసేన పార్టీ మండల అధ్యక్షుడి అకాలమరణానికి చింతిస్తూ వారి ఆత్మ శాంతికి రెండు నిమిషాల మౌనం పాటించారు.