“నా సేన కోసం నా వంతు” విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన టి.సి వరుణ్

అనంతపురం, స్థానిక జనసేన కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జ్ లు, జిల్లా కార్యవర్గ సభ్యులతో జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు టి.సి. వరుణ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి రాష్ట్ర పార్టీ కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి భవానీ రవికుమార్ లు మాట్లాడుతూ జనసేన పార్టీ నిర్వహిస్తున్న “నా సేన కోసం నా వంతు” కార్యక్రమం గురించి వివరించారు. జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున మనం అందరం కలసికట్టుగా పార్టీ కోసం అండగా నిలబడి క్రౌడ్ ఫండింగ్ చేయాలని. గ్రామ, మండల స్థాయిలో సామాన్య ప్రజలను భాగస్వామ్యులుగా అవ్వాలని సూచించారు. నియోజకవర్గ ఇంచార్జ్ లు వారి వారి మండల అధ్యక్షులతో సమావేశమై క్షేత్ర స్థాయిలో ఈ కార్యకమాన్ని తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు, నియోజకవర్గాల ఇంచార్జ్ లు మరియు జిల్లా కమీటీ సభ్యులు తక్షణమే మొదటి విడతగా “నా సేన కోసం … నా వంతు ” కార్యక్రమంలో భాగంగా మొదటి విడతగా 15,00000/- రూపాయలు ప్రకటించారు. అలాగే 1వ తారీకున అనంతపురం జిల్లాలోని నియోజకవర్గాల ఇంచార్జ్ లు మరియు 63 మండలాల అధ్యక్షులతో పాటుగా వేలాది మందితో నా సేన కోసం… నా వంతు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గాల ఇంచార్జ్ లు మరియు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.