పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి: వాసగిరి మణికంఠ
- పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి: వాసగిరి మణికంఠ
అనంతపురం జిల్లా, గుంతకల్ నియోజకవర్గం, గుంతకల్ పట్టణం, 26 వ వార్డు, హౌసింగ్ బోర్డ్ కాలనీలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ చేతుల మీదుగా ఉచితంగా ఇంటింటికి మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ గారు మాట్లాడుతూ మట్టి వినాయకుడిని పూజించడం అంటే ప్రకృతిని ఆరాధించడమే అని, విద్యార్థి దశ నుండే పర్యావరణ పరిరక్షణపై పిల్లలకు తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని, పర్యావరణం పరిరక్షణ చేయాలనే ఉద్దేశంతోనే మట్టి వినాయకుల పంపిణీ చేస్తున్నాం, రోజురోజుకీ పర్యావరణం దెబ్బతింటుందని మట్టి వినాయకుని పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు మన వంతు బాధ్యత నిర్వర్తించినట్టు అవుతుందని తెలిపారు. కరోనా నేపథ్యంలో గతంలో ఘనంగా పండుగ జరుపుకోలేక పోయామని ఈసారి కులమతాలకతీతంగా అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంతకల్ పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్, జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, పట్టణ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు కసాపురం సుబ్బయ్య, నంద, జనసైనికులు అనిల్ కుమార్, శ్రీనివాసులు, సూర్యనారాయణ, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-31-at-6.46.52-PM-1024x500.jpeg)