యు.పి.రాజు ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు

రాజాం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా స్థానిక నాయకులు యు.పి.రాజు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 60 మంది జనసైనికులు స్వచ్ఛందగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. మొదటిగా ర్యాలీగా వెళ్తు ప్రతేక పూజలు నిర్వహించారు తరువాత రక్తదానం అనంతరం కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్బంగా యు.పి.రాజు మాట్లాడుతూ రక్తదానం చేసినవారికి కృతజ్ఞతలు తెలియజేస్తు జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళలు ఎమ్ కుమారి, విజయదుర్గ, నాయకులు సామంతుల రమేష్, గొర్లె గోవిందరావు, రెడ్డి బాలకృష్ణ, నమ్మి దుర్గారావు, ఎమ్.హరిబాబు, ఎన్ని.సత్యం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *