నరసరావుపేటలో అంగరంగ వైభవంగా జనసేనాని జన్మదిన వేడుకలు
నరసరావుపేట జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 51వ జన్మదిన సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ జిలాని నాయకత్వంలో భారీగా కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. జనసేన పార్టీకి ప్రతి ఒక్క కార్యకర్త అండగా ఉండాలని తాము తోచిన విధంగా నా సేన నా వంతు కు విరాళాలు ఇవ్వాలని.. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యేంతవరకు ప్రతి ఒక్క కార్యకర్త నిబద్ధతతో పని చేయాలని అన్నారు. అనంతరం నరసరావుపేట పట్టణంలోని మహాత్మా గాంధీ, అంబేద్కర్, పొట్టి శ్రీరాములు, వంగవీటి మోహనరంగా తదితర మహనీయులకు పూలమాలలు వేసి నివాళులర్పించి. భారీ ఎత్తున కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జీవీఎస్ ప్రసాద్, జిల్లా కార్యదర్శి అద్దేపల్లి ఆనందబాబు, ఈశ్వర్, బెల్లంకొండ అనిల్, వీరవల్లి వంశి, కృష్ణం శెట్టి గోవింద్, అచ్చుల సాంబశివరావు, ఆర్కే యాదవ్, అదుర్స్ గుప్తా శ్రీకాంత్, ఎస్టి గౌస్, తిరుమల శెట్టి శ్రీనివాసరావు, సైదా విజయ్, నాగుల్ మీరా, జానీ, మేడిశెట్టి రామారావు, దుర్గా కుమారి, మిరియాల సుబ్బమ్మ, దాసరి లలిత, వీర మహిళలు, జనసేన పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-02-at-2.45.02-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-02-at-2.45.04-PM-1024x576.jpeg)