జనసేనాని జన్మదిన వేడుకలలో బాగంగా మెగా రక్తదాన శిబిరం
జనసేన రాష్ట్ర నాయకులు మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ రామ్ తాళ్లూరి ఆదేశాలనుసారం, జనసేన పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు వంగా లక్ష్మణ్ గౌడ్ మరియు జనసేన పార్టీ సాంస్కృతిక విభాగం కార్యదర్శి దుంపాటి శ్రీనివాసరావు, సూచనలు మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం నగరంలో గల కొత్త బస్టాండు సమీపాన క్రీడా ప్రాంగణంలో జనసేన పార్టీ యువజన విభాగ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 100 మంది జనసైనికులు రక్తదానం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గోని విజయవంతం చేసిన ప్రతి ఒక్క జనసైనికులకి వీర మహిళాలకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. కార్యక్రమంలో సహకరించిన నగర కమిటీ సభ్యులకు, వీర మహిళా విభాగానికి, విద్యార్థి విభాగానికి, జన సైనికులకు మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో జిల్లా వీర మహిళ విభాగ అధ్యక్షురాలు భోగ హరిప్రియ. గుంత అనూష.. మహాలక్ష్మి. మేడ బోయిన కార్తీక్, యాసంనేని అజయ్, మాలిక్, బోస్, జి. సత్య శ్రీకాంత్, ఉత్తమ్ రాజ్ ఏ. వివేక్, రవికిశోర్, రమణకుమార్, గుమ్మా మురళి, గోపి,రంజీత్, ఈశ్వర్, హరికృష్ణ, భద్రం ఇతర జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-02-at-6.17.02-PM-1024x461.jpeg)