జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

గోదావరిఖని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా రామగుండం బి పవర్ హౌస్ గడ్డ నుండి గోదావరిఖని చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం స్థానిక గోదావరిఖని చౌరస్తాలో కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో జనసైనికులు రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రావుల మధు, పెద్దపల్లి పార్లమెంట్ వర్కింగ్ కమిటీ మెంబర్ రావుల సాయి కృష్ణ, మంథని శ్రావణ్, గోపికృష్ణ, మేకల రాజ్ కుమార్, ఎముర్ల రంజిత్, మోతే రవికాంత్, చిట్టి రాజశేఖర్, బండారి తిరుపతి, బూస శ్రీనివాస్, రవీందర్ గౌడ్, శంకర్ చారి, మండలం యువజన నాయకులు, నియోజకవర్గ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.