నిడదవోలు జనసేన ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

నిడదవోలు, జనసేనాని జన్మదినం సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం , పెరవలి శ్రీ అభయ ఆంజనేయస్వామి వారి దేవాలయం నందు, పెరవలి శివాలయం నందు జనసేనని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కాంక్షిస్తూ ప్రత్యేక పూజ మరియు అభిషేకం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ప్రియసౌజన్య, జిల్లా కార్యదర్శి తుల చినబాబు, సముక్త కార్యదర్శులు శ్రీమతి ఉలుసు సౌజన్య, కాకర్ల నాని సాదా వెంకటేష్, మరియు పెరవలి మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది.