ఆమదాలవలసలో రక్తదాన శిబిరం
ఆమదాలవలస, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా, ఏర్పాటు చేసినటువంటి మెగా రక్తదాన శిబిరానికి విచ్చేసి, 92 మంది రక్తదానం చేసినటువంటి రక్తదాతలకు హృదయపూర్వక ధన్యవాదములు జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆమదాలవలస నియోజకవర్గము జనసేన పార్టీ నాయకులు శ్రీ కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, అంపిలి విక్రమ్(ఎంపిటిసి), జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో, కొల్లివలస సెంటర్లో, సెప్టెంబర్ 2వ తేదీన, న్యూ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో, మెగా రక్తదానం శిబిరం బూర్జ మండలం ఎస్సై చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. బూర్జ మండలం ఎస్సై, ఆహ్వానాన్ని మన్నించి, విచ్చేసినటువంటి ఎస్ఐ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ మెగా వైద్య శిబిరంలో 92 మంది దాతలు, రక్తదానం చేయడం జరిగింది. రక్తం దానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మెగా రక్తదాన శిబిరానికి విచ్చేసి, విజయవంతం చేసిన జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-03-at-19.16.17.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-03-at-19.16.19.jpeg)