జనసేనాని జన్మదినానికి అనాధాశ్రమంలో అన్నదానం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇంద్రనగర్ కాలనీలో అనాధాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది. ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన కార్యకర్తలు దేవా గౌడ్, బ్రహ్మం, పవన్ కుమార్, బాలాజీ, పవన్, మల్లికార్జున్, సాయి ప్రసాద్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పాల్వంచ ఇంద్ర నగర్ కాలనీ సాయిబాబా గుడి టెంపుల్ దగ్గర పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక పూజలు చేపించడం జరిగింది. భవిష్యత్తు తరాల కోసం జవాబుదారీతనం, పారదర్శకతతో కూడిన నూతన రాజకీయ వ్యవస్థ నిర్మాణం కోసం రాజకీయ పోరాటం చేస్తున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద పాల్వంచ పెద్దమ్మ గుడి దగ్గర ప్రత్యేక పూజలు చేపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు దేవా గౌడ్ బ్రహ్మం, పవన్, పవన్ కుమార్ బాలాజీ, రాఖీష్ మల్లికార్జున గౌడ్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.