ఊరుబడిని కాపాడుకుందాం: పేడాడ

  • గురువులను వేధించే ఏపి ప్రభుత్వానికి గుణపాఠం చెబుదాం.

ఆమదాలవలస, ఉపాధ్యాయులపై జరుగుతున్న అన్యాయంపై ఆమదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు మాట్లాడుతూ… గత కొంతకాలంగా ఉపాధ్యాయులకు చదువు చెప్పనీయకుండా వేధింపులకు గురిచేస్తూ వాళ్లకి నానారకంగా చిత్ర హింసలు పెడుతూ ఐ.ఎం.ఎం.ఎస్ ఆప్ పేరుతో లెట్రిన్ రూములు, బాత్ రూములు ఫోటోలు తీయించడం మధ్యాహ్న భోజనాలు ప్లేట్లు ఫోటోలు తీయించడం ఫేస్ రికగ్నిషన్ అంటూ ఉదయం సాయంత్రం ఆప్ లతో సమయం వృధా చేయించడం బైజూస్ ఆప్ప్ అనే ప్రైవేట్ కంపెనీ ప్రోత్సహించి ఉపాధ్యాయుల సామర్ధ్యాన్ని చులకన చేయడం, నాడు – నేడు పేరుతో పైపై మెరుగులు తప్ప చేసింది ఏమీ లేదు కదా, టీచర్స్ ని ఇంకా పనివాళ్ళుగా కాంట్రాక్టర్లుగా మార్చడం అన్ని సబ్జెక్టుల పుస్తకాలను పూర్తిగా ఇవ్వలేక బోధనని గందరగోళం చేయడం ఇలాంటి చిత్రహింసలు పెడుతూ ఉపాధ్యాయులను అభద్రతాభావంలోకి నెట్టేస్తున్న ప్రస్తుత పాలకుల అరాచకాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులంతా గుణపాఠం చెప్పాలని జనసేన పార్టీ మీకు అండదండగా ఉంటుందని తెలియచేసారు.