షేక్ రియాజ్ తో జె.ఎస్.పి గ్లోబల్ టీం జూమ్ సమావేశం

  • పవన్ కళ్యాణ్ ఒక్కసారి సిఎం అయితే ఆయన ఊపిరి ఉన్నంత వరకు ఆయనే సిఎంగా కొనసాగుతారు: షేక్ రియాజ్

జె.ఎస్.పి గ్లోబల్ టీం ఆధ్వర్యంలో సురేష్ వరికూటి అధ్యక్షతన ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ ముఖ్య అతిధిగా ఆదివారం జనసేన జూమ్ సమావేశం నిర్వహించడం జరిగింది. తమ తమ దేశాల నుండి ఒక్కొక్కరిగా సేవలు అందించడం కంటే అందరూ సంఘటితమై ప్రపంచ వ్యాప్తంగా అన్ని టీంలు కలిసి ఒక్క టీంగా వెళ్ళాలి అనే ముఖ్య లక్ష్యంతో ఏర్పడినటువంటి “జె.ఎస్.పి గ్లోబల్ టీం” నుండి వివిధ దేశాలకు చెందిన ఎన్నారై జనసేన నాయకులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నటువంటి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ తో వివిధ నియోజకవర్గాలకు చెందిన ఎన్నారై జనసేన నాయకులు తమ తమ నియోజకవర్గాలలోని సమస్యలపై చర్చించడం జరిగింది. షేక్ రియాజ్ మాట్లాడుతూ… ఎన్నారై జనసేన నాయకులు పార్టీ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడడం జరిగింది. పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టినటువంటి నా సేన కోసం నా వంతు కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలని, అధినేత నిర్ణయాలను శిరసా వహిస్తూ తాను పార్టీని బలోపేతం కోసమే పనిచేస్తానని, పవన్ కళ్యాణ్ ఒక్కసారి సిఎం అయితే ఆయన ఊపిరి ఉన్నంత వరకు ఆయనే సిఎంగా కొనసాగుతారని తెలియజేయడం జరిగింది. ఈ సమావేశంలో అమెరికాకి చెందిన జనసైనికులు విదేశీ విద్యా దీవెన పధకం అనేది పేరులో మాత్రమే దీవెన ఉందని విద్యార్ధులకు మాత్రం ప్రభుత్వం నుండి ఏ విధమైన సహకారాలు అందట్లేదని తెలిపారు. వివిధ నియోజకవర్గాలకు చెందిన ఎన్నారై జనసేన నాయకులు తమ తమ నియోజకవర్గాలలోని వివిధ సమస్యలను తెలుపుతూ వాటికోసం జనసేన తరపున గళం వినిపించాలని తెలుపడంతో పాటూ తమ తమ సందేహాలను ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ కి వివరించగా ఆయన క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేవిధంగా తమ అమూల్యమైన సలహాలను సూచనలను ఇవ్వడం జరిగింది. అన్ని దేశాల జనసేన నాయకులతో కో ఆర్డినేట్ చేసుకుని ఈ సమావేశాన్ని అద్భుతంగా నిర్వహించిన నిర్వాహకులను పలువురు ప్రశంసించడం జరిగింది.