నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలి: మాకినీడి శేషుకుమారి

  • రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి గురించి ఆలోచించే పార్టీ జనసేన పార్టీ

కాకినాడ జిల్లా, పిఠాపురం పట్నంలో స్థానిక రామ టాకీస్ రోడ్డు 4వ వార్డు నందు పుణ్యమంతుల సూర్యనారయణ మూర్తి, మేళం బాబీ ఆధ్వర్యంలో పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి మాకినీడి శేషుకుమారి పర్యటించి జనసేన పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను, కౌలు రైతులకు అందిస్తున్న సాయం కోసం, ప్రజలకు వివరించి నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో వారిని కూడా భాగస్వామ్యం చేద్దామని పిఠాపురం పట్టణం 4వ వార్డులో ఇంచార్జి శేషుకుమారి మాట్లాడుతూ… జనసైనికులు, వీర మహిళలతో మీ బాధ్యతగా మీతో తోచిన 10 రూ. నుంచి అమౌంట్ ను పార్టీకి డొనేట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో కూడా తోచిన అమౌంట్ డొనేట్ చేయించమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పుణ్యమంతుల సూర్యనారయణమూర్తి, మేళం రామకృష్ణ, మాజీ కౌన్సిలర్లు వేణు నారాయణరావు కర్రీ కాశీ విశ్వనాథ్, పబ్బీరెడ్డి దుర్గా ప్రసాద్, బుర్రా సూర్యప్రకాష్, బంటుపల్లి ప్రసాద్, గొల్లపల్లి గంగ, నామా శ్రీకాంత్, కొనమాచలి దుర్గాప్రసాద్, నామా సాయిబాబు, జనసైనికులు నాయకులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.