అమలాపురం 7వ వార్డులో నా సేన కోసం నా వంతు

కోనసీమ జిల్లా, జనసేన పార్టీ “నా సేన కోసం నావంతు” కార్యక్రమంలో భాగంగా క్రౌడ్ ఫండింగ్ కార్యక్రమాన్ని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ శెట్టి బత్తుల రాజబాబు ఆదేశాల మేరకు అమలాపురం 7వ వార్డు లో సామూహికంగా నిర్వహించారు జనసైనికులు తమ తమ మొబైల్ నుంచి పార్టీ సూచించిన నెంబరుకు ఫోన్ పే చేసారు. ఆ వార్డుల్లో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీకి సహకరించాలని, పార్టీ ని నిర్మాణాత్మకంగా నడిపించడానికి నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కౌన్సిలర్లు గండి దేవి హారిక స్వామి(7వ వార్డు), గొలకోటి విజయ లక్ష్మి వాసు(9వ వార్డ్), నల్ల వరలక్ష్మి, దంగేటి శ్రీహరి, తిక్కిరెడ్డి రాంబాబు, బసవ కృష్ణ, నల్ల శ్రీను, తిక్కీరెడ్డి రాజా, ఆకుల రమేష్, మారెళ్ళ షన్ను, బోనం శ్రీను, కూన సోమేష్, కామిశెట్టి దిలీప్, గారపాటి సాయి, నామన శ్రీధర్, మారెళ్ళ వెంకటేష్, నామన ప్రసాద్, తిక్కాయ శ్వంత్, బోనం స్వామి, జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.