పాత రావిచెర్లలో అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమ్మిశెట్టి వాసు

నూజివీడు నియోజకవర్గం, పాత రావిచెర్ల గ్రామంలో వినాయక నవరాత్రుల సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు హాజరవడం జరిగింది. అమ్మిశెట్టి వాసు కి గణేష్ ఉత్సవ కమిటీ, జనసైనికులు, గ్రామస్థులు, మహిళలు ఘనస్వాగతం పలికారు. ఈ సంధర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించి అమ్మిశెట్టి వాసుకి తీర్థ ప్రసాదాలు అందచేశారు. 7 సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు అమ్మిశెట్టి వాసుకి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ, నూజివీడు, చాట్రయి, ఆగిరిపల్లి మండల జనసేన పార్టీ అద్యక్షులు యర్రంశెట్టి రాము, ఆరెల్లి కృష్ణ, జలసూత్రం పవన్, మండల కార్యదర్శిలు చెరుకుపల్లి కిషోర్, విజయవాడ రూరల్ మండలం ప్రధాన కార్యదర్శి లంకే సురేష్, తోట మల్లేశ్వరరావు, కొన్నంగుంట రాంబాబు, పగడాల దుర్గారావు, తోట బలరామ్, కస్తూరి అశోక్, వీర మహిళలు రామిశెట్టి తేజస్విని, నవ్య, రావిచెర్ల జనసైనికులు పాల్గొన్నారు.