విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తగరపు శ్రీనివాస్
విజయవాడ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్టోబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సంధర్భంగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు తగరపు శ్రీనివాస్ మరియు నాయకులు వంశీకృష్ణ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. పర్యటన విజయవంతం కావాలని, జనసేన అధికారంలోకి రావాలని మరియు అధినేతకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దుర్గమ్మను వేడుకున్నారు. అనంతరం జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ ని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-08-at-12.51.57-768x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-08-at-12.52.39-504x1024.jpeg)